Wednesday, May 1, 2024

NZB :కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి కొమ్ము కాస్తోంది…ఎంపీ అర‌వింద్‌…

నిజామాబాద్ ప్రతినిధి, ఏప్రిల్ 10 (ప్రభ న్యూస్): కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి కొమ్ము కాస్తోందనీ ఎంపీ ధర్మ పురి అరవింద్ ధ్వజమె త్తారు. మనది మోదీ కుటుంబం లో భాగంగా బుధవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్మూర్ పట్టణంలో నిర్వహించిన చాయిపే చర్చ కార్యక్రమానికిపార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

- Advertisement -

ఆర్మూర్ లోని జీవన్ మాల్ విషయంలో అధికారం వచ్చిన వెంటనే నోటీ సులు ఇచ్చి కాంగ్రెస్ హడావుడి చేసింద న్నారు.మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి.. కాంగ్రెస్ నాయ కులు, అధికారులకు కొంచెం చెల్లించ గానే మళ్ళీ సపుడు లేదన్నారు. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కు రూ. 50 కోట్లు కట్టాలి, శాఖకు కు ఒక కిస్తి మాత్రమే కట్టాడు, ఇంకా ఆర్టీసీ, మున్సిపాలిటీ కి కట్టాలనీ తెలిపారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రధాని మోదీ ప్రత్యేక కృషి చేస్తున్నారని అన్నారు.తెలంగాణలో వ్యవసా య ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు నిజామాబాద్ సరై న ప్రదేశమని అన్నారు. మోది రాక ముందు వరి మద్దతు ధర రూ.1300 ఉంటే.. మోది వచ్చాక రూ.2 వేలు దాటిందనీ గుర్తు చేశారు.ఫర్టిలైజర్, యూరియా లు వంటి వాటి మీద రైతులకు రూ. 18వేలు రైతులకు మోది ఇస్తున్నాడనీ తెలిపారు.

ప్రతి ఎకరాకు రూ.6వేలు కిసాన్ సమ్మాన్ నిధి కింద అందిస్తున్నారన్నారు. నిజామాబాద్ జిల్లాకు పసుపు, జగిత్యాల జిల్లా కు మామిడి ని వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ కింద ఎంపిక చేశామని తెలిపారు.ఈ రెండు పంటల ఎగుమతులపై కేంద్రం చర్యలు తీసుకుంద న్నారు.అందులో భాగంగానే పసుపు ను ఇతర దేశాలకు ఎగుమతి చేశాం.. మంచి ధర లభించిందనీ అన్నారు. పసుపు బోర్డు వస్తే.. విత్తనాలు, భూసా ర పరీక్షలు మొదలు.. అన్ని అంశాలపై దృష్టి ఉంటుం దన్నారు. పరిమితిలో ఎరువు లు వాడితే పసుపు ఎగుమ తులకు డిమాండ్ ఉంటుందనీ రైతులకు సూచించారు. గోదా ములు, పసుపు శుద్ది కర్మా గారాలు వస్తాయన్నారు. రైతు లు, వినియోగదారులను కలిపే వ్యవస్థ ఏర్పాటు అవుతుంద న్నారు.రైతుల వద్దకే కొను గోలుదారు వచ్చి పంట కొనేలా వ్యవస్థ ఏర్పాటు అవుతుందనీ ఎంపీ తెలిపారు.నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కేవలం ఒకే ఒక్క రైల్వే బ్రిడ్జి ఉండేది.. నేను వచ్చాక ఏడు తీసుకొచ్చాననీ ఈ సందర్భంగా తెలిపారు. అవి నీతి కారణంగానే చక్కెర పరిశ్ర మలు తెరుచుకోవడం లేదనీ మండిపడ్డారు. నిజామాబాద్ మార్కె ట్ యార్డు తెలంగాణా లోనే పెద్దదన్నారు.

పసుపు లావా దేవీల మీదనే యార్డు కు రూ 10-12 కోట్లు ఆదాయం వస్తుంది… ఏటా 20 కోట్ల ఆదా యం ఉంటుందన్నారు.కానీ ఆ నిధులు నిజామాబాద్ మార్కె ట్ యార్డులో ఖర్చు చేస్తలేరనీ తెలిపారు.కొన్నేళ్లుగా ఆ నిధులు మొత్తం సిరిసిల్ల, సిద్ధిపేట కు వెళ్లిపోయాయని ఆరోపించారు.నిజామాబాద్ మార్కెట్ యార్డులో ఒక్క సౌలత్ ఏర్పాటు చెయ లేదన్నారు.సీఏఏ 2019 లో తెస్తే… కాంగ్రెస్ లొల్లి పెట్టిందనీ గుర్తు చేశారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ముస్లిం లకు సైతం పౌర సత్వం ఇవ్వాలని ఆందోళన చేశాడన్నారు. ఇప్పుడు సీఏఏ అమలు చేస్తుంటే ఎన్నికలు ఉన్నాయని హిందువుల ఓట్ల కోసం జీవన్ రెడ్డి మౌనంగా ఉన్నాడన్నారు. ముస్లిం లకు పౌరసత్వం ఇస్తే ప్రత్యేకంగా ముస్లిం దేశాలు ఎందుకు మరి అని ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement