Sunday, April 28, 2024

దాడిని ఖండిస్తూ.. నిర‌స‌న తెలిపేందుకు వెళ్తున్న శ్రీశైలం గౌడ్ అరెస్ట్

నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై దాడిని ఖండిస్తూ నిరసన తెలిపేందుకు బయలుదేరిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ను పోలీసులు అరెస్టు చేసి వాహనంలో తిప్పుతున్నారు. ఈరోజు ఉదయం నుండే ఇంటి చుట్టూ పోలీసులను మోహరించారు. ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ…రాష్ట్రంలో రైతాంగం ఇబ్బందుల్లో ఉన్న దృష్ట్యా వరి కొనుగోలు కేంద్రాల్లో పర్యటించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో వివిధ ప్రాంతాల్లో పర్యటించిన సందర్భంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామ‌న్నారు. భారతీయ జనతా పార్టీ అనేక సందర్భాలలో ప్రజా సమస్యలు తెలుసుకోవడం కోసం పర్యటించిన సందర్భాలు ఉన్నాయన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజా సమస్యలను తెలుసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుందన్నారు. సమస్యలను పరిష్కరించడం ఇష్టంలేని టిఆర్ఎస్ పార్టీ దాడులకు పాల్పడడం చాలా దురదృష్టకరమని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement