Thursday, May 9, 2024

TRS MLA సుధీర్ రెడ్డికి ”స్పిరిట్ ఆఫ్ హ్యుమానిటీ” అవార్డు

టీఆర్ఎస్ పార్టీ ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి ప్రతిష్టాత్మకమైన అవార్డు దక్కింది. విశ్వ గురు అంతర్జాతీయ రికార్డ్స్ సంస్థ ద్వారా “స్పిరిట్ ఆఫ్ హ్యుమానిటీ అవార్డు” ను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేతుల మీదుగా అందుకున్నారు. మంగళవారం ఉదయం రాజ్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అందజేశారు. కరోనా, లాక్ డౌన్ సమయంలో,  హైదరాబాద్ లో గతేడాది వచ్చిన వరదల సమయంలో రాజకీయాలకు అతీతంగా, ప్రజలకు, అంధులు, వికలాంగులు, అనాథలకు అందించిన అపారమైన సేవలు చేశారు. అంతే కాదు, గత కొద్ది సంవత్సరాలుగా నిర్విరామంగా సేవా కార్యక్రమాలలో పాలుపంచుకుంటున్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి విశ్వగురు అంతర్జాతీయ రికార్డ్స్ సంస్థ ద్వారా “అంతర్జాతీయ స్పిరిట్ ఆఫ్ హ్యుమానిటీ” అవార్డు దక్కింది. ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో సత్యవోలు రాంబాబు, డైరెక్టర్ పూజిత, సోషల్ మీడియా ఇంచార్జ్ రమాకాంత్, ఎంఆర్డిసిఎల్ చైర్మన్ ఓఎస్డి పగడాల శివప్రసాద్, కృష్ణ సాగర్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement