Friday, April 26, 2024

విద్యార్థి అనుమానాస్పద మృతిపై స‌మ‌గ్ర విచార‌ణ : సబితా ఇంద్రారెడ్డి

వికారాబాద్ జిల్లా పూడూరు మండలం చిలాపూర్ సమీపంలో ఉన్న కేశవరెడ్డి పాఠశాలలో మూడవ తరగతి చదువుతున్న విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. విద్యార్థి మృతిపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమగ్ర విచారణ చేపట్టాలని పాఠశాల విద్య డైరెక్టర్ దేవసేనను ఆదేశించారు. విచారణలో బాధ్యులుగా తేలిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపట్టాలని పాఠశాల విద్య డైరెక్టర్ దేవసేనను ఆదేశించారు. విద్యార్థి మృతి అత్యంత బాధాకరమని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement