Monday, April 29, 2024

MBNR: కారు, బైకు ఢీ.. ఇద్దరి దుర్మరణం

మక్తల్, జనవరి30 (ప్రభ న్యూస్) : కారు, బైక్ ఢీకొన్న సంఘటనలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందిన సంఘటన నారాయణపేట జిల్లా మక్తల్ మండల పరిధిలోని కాచ్ వార్ వద్ద 167వ జాతీయ రహదారిపై ఇవాళ మ‌ధ్యాహ్నం చోటుచేసుకుంది.

స్థానికుల కథనం మేరకు హైదరాబాద్ వైపు నుండి రాయిచూర్ వైపు బీఎండబ్ల్యూ కారు వెళ్తుండగా కాచ్ వార్ వద్ద పొలాల వైపు నుండి రోడ్డుపైకి ఇద్దరు యువకులు బైక్ పై రావడంతో కారు బైకు ఢీకొన్నాయి .ఈ సంఘటనలో బైక్ పై వెళుతున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులిద్దరూ కూడా మక్తల్ మండల కేంద్రంలోని భరత్ నగర్ కు చెందిన వారుగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement