Tuesday, April 30, 2024

Leaders టెన్ష‌న్.. టెన్ష‌న్‌! .. వైసీపీ నేత‌ల్లో ఆందోళ‌న‌

అసెంబ్లీ, లోక్‌సభ ఇన్‌చార్జుల మార్పులు, చేర్పులపై తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో.. వైసీపీ అధిష్టానం బిజీబిజీగా ఉంది. ఈ తరుణంలో మరో వైపు మంగళవారం అనేక మంది ఎమ్మెల్యేలు తమ భవితవ్యాన్ని తెలుసుకునే ఉత్కంఠతో తాడేపల్లికి చేరుకున్నారు. ఇప్పటికే నాలుగు జాబితాలను వైసీపీ అధిష్టానం విడుదల చేయగా.. అయిదో జాబితాపై సీఎం జగన్ ఫోకస్ పెట్టారు. ఈ నాలుగు జాబితాల్లో పేరులేని నేతలంతా సీఎం క్యాంప్ ఆఫీసు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మంత్రులు గుడివాడ అమరనాథ్, ఉషశ్రీ చరణ్, ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ తాడేపల్లికి చేరుకున్నారు. మంగళవారం సాయంత్రంలోగా అయిదో జాబితాను విడుదల చేస్తారని, తమకు సీటు ఉందా ? లేదా? స్థానం మార్చారా? అసెంబ్లీకి ఇచ్చారా? ఎంపీగా పోటీ చేయమంటారా? అని వైసీపీ నేతలను తమ జాతకాలపై ఆలోచనల్లో ఉత్కంఠ భరిత వాతావరణాన్ని ఎదుర్కొంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement