Tuesday, May 7, 2024

Khammam: విద్యార్థులతో కలెక్టర్ సహపంక్తి భోజనం

అంతర్జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఖమ్మం నగరంలోని ఇంద్రానగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉచిత నులిపురుగుల మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ గౌతమ్ ప్రారంభించారు. ఈసందర్భంగా విద్యార్థులతో కలిసి కలెక్టర్ సహపంక్తి భోజనం చేశారు. అనంతరం పాఠశాలను తిరిగి పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ బి.మారుతి, డిఇఓ,ఎంఈఓ, స్థానిక కార్పొరేటర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement