Saturday, May 4, 2024

తెలంగాణ‌లో కోకాకోలా.. వెయ్యి కోట్ల పెట్టుబ‌డుల‌కు రెడీ..

హిందుస్థాన్ కోకాకోలా బేవ‌రేజ‌స్ సంస్థ‌ (హెచ్ సీ సీ బీ) తెలంగాణలో ₹1000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. సిద్దిపేట జిల్లా బండ తిమ్మాపూర్ ఫుడ్‌ పార్క్ లో తమ రెండో ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ తో జ‌రిగిన భేటీలో హెచ్సీసీబీ చైర్మన్, సీఈఓ నీరజ్ గార్గ్ ఇవ్వాల ప్రకటించారు. ఈ సందర్భంగా ఘన వ్యర్థాలు, వ్యర్థ జలాల నిర్వహణ, నైపుణ్య శిక్షణ వంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం, హిందుస్థాన్ కోకాకోలా బెవరేజెస్ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement