Monday, April 29, 2024

రెండు రోజులు మద్యం దుకాణాలు బంద్‌..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : శ్రీరామ నవమి నేపథ్యంలో నగరంలో మద్యం అమ్మకాలపై ఆంక్షలు అమలు చేస్తూ ఎక్సైజ్‌ శాఖ నిర్ణయం తీసుకుంది. శనివారం సాయంత్రం 6 నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు, బార్లు, కల్లు దుకాణాలు మూసి వేయాలని ఆదేశించింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్టు అబ్కారీ శాఖ వెల్లడించింది. శ్రీరామ నవమి నేపథ్యంలో జరగనున్న శోభాయాత్రలకు హైదరాబాద్‌, భైంసాలలో హైకోర్టు అనుమతించిన నేపథ్యంలో అబ్కారీ శాఖ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కారణంగా హైదరాబాద్‌తో పాటు నిర్మల్‌ జిల్లాలో ఈ ఆంక్షలు కొనసాగనున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement