Monday, April 29, 2024

Breaking: చెవిరెడ్డికి మంత్రి ప‌ద‌వి లేన‌ట్టే.. తుడా చైర్మ‌న్‌గా మ‌రో రెండేళ్లు పొడిగింపు..

చంద్ర‌గిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డికి ఈ సారి జ‌రిగే పున‌ర్‌వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌లో మంత్రి ప‌ద‌వి లేన‌ట్టే అని తేలిపోయింది. ఆయ‌న‌ను తుడా చైర్మ‌న్‌గా మ‌రో రెండేళ్ల కాలం పొడిగిస్తూ ఏపీ ప్ర‌భుత్వం ఇవ్వాల ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ నెల 12 నుంచి ఆయ‌న మ‌రో రెండేళ్ల పాటు ఆ ప‌ద‌విలో కొన‌సాగ‌నున్నారు.

తుడా ఛైర్మన్‌గా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని మరో రెండేళ్లపాటు కొనసాగిస్తూ ఏపీ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్‌ 11న మంత్రి వర్గ పునర్‌ వ్యవస్థీకరణ జరుగుతున్న నేపథ్యంలో అంతకు ముందే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి పదవి కాలాన్ని కొనసాగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement