Thursday, May 23, 2024

CM Tour – హ‌స్తిన‌లో తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి… కాసేపటిలో కాంగ్రెస్ పెద్ద‌ల‌తో భేటి..

న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు.. దీని కోసం నేటి ఉద‌యం హైదరాబాద్ నుంచి ఢిల్లీ కి విమానంలో బయలుదేరి వెళ్లారు. నేడు అయ‌న కాంగ్రెస్ ముఖ్యనేతలు ఖర్గే, సోనియా, రాహుల్‌, ప్రియాంక గాంధీతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా మంత్రివర్గ విస్తరణ, ఎమ్మెల్సీల ఎంపిక సహా పార్లమెంటు ఎన్నికల్లో వ్యవహరించాల్సిన అంశాలపై చర్చించనున్నారు. సోనియాగాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయాలని విజ్ఞప్తి చేస్తూ పీఏసీ చేసిన తీర్మానాన్ని అధిష్ఠానానికి అందించనున్నారు. అలాగే, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, తదితర అంశాలపైనా కేంద్రంలోని ముఖ్యులను కలిసి వారితో చర్చించే అవకాశం ఉన్నట్టు భావిస్తున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోడీ అపాయింట్‌మెంట్ కోరినట్లు సమాచారం. ప్ర‌ధాని అపాయింట్మెంట్ ఇచ్చిన‌ట్ల‌యితే సిఎం హోదాలో తొలిసారిగా రేవంత్ ప్ర‌ధానితో భేటి కానున్నారు..ఈ భేటి అనంత‌రం తిరిగి రేవంత్ హైద‌రాబాద్ కు ప‌య‌న‌మ‌వుతారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement