Sunday, April 28, 2024

Breaking: సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటన రద్దు..!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ్టి ఢిల్లీ పర్యటన రద్దయ్యింది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాల నేపథ్యంలో.. అందులో పాల్గొనేందుకు ఆయన ఢిల్లీకి వెళ్లాల్సి ఉంది. అసెంబ్లీ సెషన్ నడుస్తుండడంతో ఇవాళ ఉదయం సభకు వచ్చిన సీఎం.. ఆ తర్వాత మధ్యాహ్నం స్పెషల్ ఫ్లైట్​లో ఢిల్లీకి బయల్దేరి వెళ్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. కానీ తాజాగా ఆ పర్యటన రద్దయ్యింది. ఇక సీడబ్ల్యూసీ శాశ్వత ఆహ్వానితుడిగా ఉన్న దామోదర రాజనర్సింహ, స్పెషల్ ఇన్వైటీ అయిన వంశీచంద్ రెడ్డి కూడా సమావేశాలకు హాజరు కానున్నారు.

ఢిల్లీలోని ఏఐసీసీ ఆఫీస్​లో మధ్యాహ్నం 3 గంటలకు జరగనున్న ఈ భేటీలో.. వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, రాబోయే లోక్ సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నట్టు తెలుస్తున్నది. ఏపీ నుంచి రఘువీరా రెడ్డి, పల్లం రాజు, కొప్పుల రాజు, సుబ్బరామి రెడ్డి పాల్గొననున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి దామోదర రాజనర్సింహ, వంశీచంద్ రెడ్డిలు హాజరు కానుండడంతో సీఎం పర్యటన రద్దైనట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement