Saturday, May 4, 2024

Review Meeting – సాగునీటి రంగంపై రేవంత్ స‌మీక్ష‌…. ప్రాజెక్ట్ ల వివ‌రాలు ఇవ్వాల‌ని ఆదేశం

హైద‌రాబాద్ .ప్రతి ప్రాజెక్టుకు సంబంధించిన మార్గదర్శకాలు ప్రజలకు తెలియజేసేలా చూడాలని సిఎం రేవంత్‌ రెడ్డి అధికారులకు సూచించారు. ప్రాజెక్టులకు సంబంధించిన అన్ని రకాల లెక్కలు పూర్తిగా ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలను ప్రజలకు తెలియకుండా దాచిపెట్టే ప్రయత్నం చేయొద్దని ఒకవేళ అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. గురువారం తన నివాసంలో వ్యవసాయ, నీటి పారుదల రంగాలపై మంత్రులు తుమ్మల, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డితో కలిసి రేవంత్‌ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ప్రభుత్వంలో ప్రతి నిర్ణయం పారదర్శకంగా ఉండాల్సిందేనన్న ఉద్దేశంతో ప్రతి అంశాన్ని ప్రజలకు విడమరచి చెబుతున్నా మన్నారు. ఈ విషయంలో అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండి నిజాలను ప్రజలకు వివరించాలన్నారు. 1956 నుంచి 2014 వరకు, 2014 నుంచి 2023 వరకు నిర్మించిన ప్రాజెక్టులు, వాటి నిర్మాణ వ్యయాలు, ప్రాజెక్టుల వారీగా సాగులోకి తెచ్చిన ఆయకట్టు వివరాలను అధికారుల ద్వారా సీఎం తెలుసుకున్నారు. రాష్ట్రంలోని సాగు నీటి ప్రాజెక్టులకు సంబంధించి పూర్తి స్థాయి నివేదిక అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement