Monday, April 29, 2024

Breaking: జానారెడ్డితో సీఎం రేవంత్ భేటీ

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ సీఎల్పీ నేత జానారెడ్డిని కలిశారు. జానారెడ్డి నివాసానికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి ఆయనతో మార్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈసందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని జానారెడ్డి శాలువాతో సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు.

అయితే జానారెడ్డి మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా.. తన కుమారుడు జైవీర్ రెడ్డిని పోటీ చేయించి గెలిపించాడు. రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత తొలిసారిగా జానారెడ్డి ఇంటికెళ్లారు. తెలంగాణ మంత్రివర్గంలో ఇప్పటికే పదకొండు మందికి చోటు కల్పించగా.. మరో ఏడు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సీఎం జానారెడ్డికి కలిసినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement