Thursday, May 2, 2024

MDK: 23న కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్… హరీశ్ రావు

ఈనెల 23న సీఎం కేసీఆర్ కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలు ప్రారంభించడానికి వస్తున్నారని మంత్రి హరీశ్ రావు తెలిపారు. మెదక్ జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… బీఆర్ఎస్ కార్యాలయాన్ని, సమీకృత కార్యాలయ సముదాయంను ప్రారంభిస్తారన్నారు. కొన్ని రాష్ట్రాల నుంచి అధికారులు, మంత్రులు వచ్చి చూడటం జరిగిందన్నారు. అన్ని కార్యాలయాలు ఒకే చోట ఉండటంతో సమస్యలు పరిష్కరించుకోవచ్చన్నారు. మెదక్ జిల్లా అనేది ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష అని, సీఎం కేసీఆర్ అయ్యాకే మెదక్ జిల్లా కల నెరవేరిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉంటే కలగానే ఉండేదన్నారు. కలలు కనడమే కాదు ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేది సీఎం కేసీఆరే అన్నారు. మన సంక్షేమ పథకాలు చెప్పినప్పుడు ఇతరులు ఆశ్చర్యపోయారన్నారు.
ఇందిరాగాంధీ మాట ఇచ్చి తప్పిన జిల్లా.. ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వమన్నారు. మెదక్ కు రైలు ఉహించలేము.. సీఎం కేసీఆర్ నిధులు ఇవ్వడంతోనే రైలు కల నెరవేరిందన్నారు. మెదక్ కు మెడికల్ కళాశాల వస్తదని కలలో కూడా అనుకోలేదన్నారు. మెదక్ పట్టణ రూపురేఖలు మారిపోయాయన్నారు.

23న పండుగ లాగా విజయవంతం చేయాలన్నారు. సీఎం కేసీఆర్ కు కృతజ్ఞత చెప్పాలన్నారు. యావత్ మెదక్ జిల్లా ప్రజలు వచ్చి కృతజ్ఞతలు చెప్పి విజయవంతం చేయాలన్నారు. మధ్యాహ్నం 2గంటలకు సభ ఉంటుంది..ఈ సభ సీఎం కేసీఆర్ కృతజ్ఞత సభ అన్నారు. 9ఏండ్లలో ఇంత అభివృద్ధి జరగటం కేసీఆర్ విజన్ అని, కేసీఆర్ ను ఆశీర్వదించాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ లది మేకపోతు గాంభీర్యమన్నారు. మూడోసారి సీఎం అయ్యేది కేసీఆరే అన్నారు. కాంగ్రెస్ కు లీడర్లు లేరూ… బీజేపీ కి క్యాడర్ లేరు.. బీఆర్ఎస్ కు తిరుగులేదన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. 24 గంటల కరెంటు అంటే నమ్మలే.. ఇచ్చి చూపించారన్నారు. కాంగ్రెస్, బీజేపీ లు కేసీఆర్ ను తిట్టడంలో బిజీగా ఉంటే కేసీఆర్ వడ్లు పండించడంలో బిజీ అన్నారు. నాలుగు లక్షల ఎకరాల్లో పొడుపట్టాలు ఇచ్చామని, 1.50 లక్షల కుటుంబాలకు పోడు పట్టాలు ఇచ్చామన్నారు. 30 లక్షల కుటుంబాలకు రుణమాఫీ జరిగిందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం లక్ష రుణమాఫీ చేస్తున్నామన్నారు. ప్రతి రైతుకు రుణ మాఫీ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.. మేము ఆచరిస్తామన్నారు. రుణమాఫీ చివరి రూపాయి వరకు చెల్లిస్తామన్నారు. బీఆర్ఎస్ పథకాలను చూసి కాంగ్రెస్ నేతలు బేజారు అవుతున్నారన్నారు. కోటి ఎకరాలకు పైగా తెలంగాణలో సాగు చేస్తున్నారన్నారు.

దేశంలోనే అతిఎక్కువ వరి ధాన్యం పండించడంలో తాము పోటీపడుతున్నామన్నారు. కేసీఆర్ ను తిట్టడానికి ప్రతిపక్షాలు పోటీపడుతున్నాయన్నారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని కాంగ్రెస్ నేతలు చూస్తున్నారన్నారు. ఎప్పుడూ ప్రజల మధ్య ఉండే నాయకులు అభివృద్ధి, ఇంటి ముందు అభివృద్ధి.. కంటి ముందు బీఆర్ఎస్ ఉంటుందన్నారు. బీజేపీ క్యాడర్ కోసం వెతుకులాడుతున్నారన్నారు. హ్యాట్రిక్ సీఎం కేసీఆర్ అన్నారు. మైనార్టీలకు రూ.లక్ష చెక్కులు పంపిణీ చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కరోజే 10వేల మందికి రూ.లక్ష చొప్పున ఇచ్చామన్నారు. బీసీ కులవృత్తులకు ఇచ్చామన్నారు. ఒక లక్ష మంది మైనార్టీలకు ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. మైనార్టీల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు. 204 మైనార్టీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేశామన్నారు. కాంగ్రెస్, టీడీపీ లు రెండు కళాశాలలు ఏర్పాటు చేశాయా అని ప్రశ్నించారు. మైనార్టీలకు కాంగ్రెస్ ఒక్కరూపాయి ఇవ్వలేదన్నారు. ఓవర్సీస్ స్కాలర్ షిప్ ద్వారా వేలాది మంది విదేశాల్లో చదువుకుంటున్నారన్నారు. తెలంగాణ సర్కార్ 9ఏండ్లలో రూ. 10వేల కోట్లు మైనార్టీల సంక్షేమానికి ఖర్చు చేసిందన్నారు.బతుకమ్మ, క్రిస్మస్, రంజాన్ పండుగలను అధికారికంగా చేసింది సీఎం కేసీఆర్ మాత్రమేనన్నారు. రూ.కోటి రూపాయలు షాదీఖానకు మంజూరు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement