Sunday, May 5, 2024

వివాహిత ఆత్మ‌హ‌త్య …

ఇందల్ వాయి – ఇందల్ వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని గాన్నరమ్ గ్రామానికీ చెందిన వివాహిత మహిళ ఇంట్లో ఉరివేసుకొని హత్మహాత్య చేసుకున్న ఘటన ఇందల్వాయి పోలీస్టేషన్ పరిది గన్నరం గ్రామంలో చోటుచేసుకొంది. ఇందల్వాయి ఎస్ఐ. ఎస్ మహేష్ తెలిపినా వివరాలిలా వున్నాయి గన్నారం గ్రామానికి చెందిన కాసుల సవితకు 2008లో.గన్నారం గ్రామానికి చెందిన.కాసుల నాగేష్ తో వివాహమైనట్లు తెలిపారు. వీరికి ముగ్గురు ఆడపిల్లలు పెద్దపాప లక్కి 8వ తరగతి .2వ పాప కావ్య 7వ తరగతి. 3వ పాప శ్రావ్య 2వ తరగతి చదువుతున్నట్లు ఎస్ ఐ మహేష్ వివారించారు. భర్త నాగేష్. బతుకు దెరువు కోసం గల్ఫ్ దేశానికి వెళ్ళినట్లు తెలిసిందన్నారు.

ఇట్లో ఎవరు లేని సమయంలో స్వంత ఇంట్లోనే ఊరి పెట్టుకొని మృతిచెoదడంతో స్థానికులు గమనించి పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించడంతో. ఘటన స్థలానికి పోలీస్ లు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్ల ప్రభుత్వ మార్చురీకి తరలించినట్లు తెలిపారు. .కాసుల సవిత ఎందుకు హాత్మహత్య చేసుకుందో విచారణ చేపడుతున్నట్లు తెలిపారు. మృతురాలి తల్లి ఇచ్చినా పిర్యాదు తో కేసూ నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement