Friday, May 3, 2024

CM KCR : ఇవాళ నాలుగు చోట్ల ప్ర‌జాఆశీర్వాద స‌భ‌లు

బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఇవాళ‌ నాలుగు చోట్ల ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లాలోని దేవరకద్రలో బీఆర్ఎస్ అభ్యర్థి ఆల వెంకటేశ్వర్ రెడ్డి, గద్వాలలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మక్తల్ లో చిట్టెం రామ్మోహన్ రెడ్డి, నారాయణపేటలో రాజేందర్ రెడ్డికి మద్దతుగా ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తారు.

మధ్యాహ్నం 12:30 గంటలకు దేవరకద్ర, 1:30 గంటలకు గద్వాల , 2:40 గంటలకు మక్తల్ , 4:00 గంటలకు నారాయణపేట నియోజకవర్గాల్లోని ప్రజా ఆశీర్వాద ప్రచార సభలు నిర్వహించనున్నారుఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement