Monday, May 6, 2024

అధికారుల తీరుపై కేసీఆర్ అసహనం.. రిబ్బన్‌ను పీకి పడేసిన సీఎం!

సిరిసిల్ల పర్యటనలో అధికారుల తీరుపై సీఎం కేసీఆర్‌ తీవ్ర అసహనానికి గురయ్యారు. ఆదివారం మంత్రి కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్లలో జరిగిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల శంకుస్థాపన, గృహప్రవేశాల కార్యక్రమంలో పాల్గొన్న కేసీఆర్… ఓ ఇంటి గృహ ప్రవేశానికి రెడీ అయ్యారు. వేదమంత్రాల మధ్య దంపతులతో సహా కొత్త ఇంట్లోకి అడుగు పెట్టేందుకు సిద్ధమయ్యారు. అయితే రిబ్బన్ కట్ చేద్దామనుకునే సరికి కత్తెర లేకుండా పోయింది. అందరూ ‘కత్తెర… కత్తెర..’ అంటూ అటూ ఇటూ చూడ్డం మొదలు పెట్టారు. దీంతో కేసీఆర్ ఆగ్రహానికి గురయ్యారు. వెంటనే తనే చేత్తే రిబ్బన్‌ను పీకి పడేశారు. అనంతరం దంపతులతో కలిసి కొత్త ఇంట్లోకి అడుగుపెట్టారు. ఈ పరిణామంతో అధికారులు షాకయ్యారు.

ఇది కూడా చదవండి: సిరిసిల్లలో సీఎం కేసీఆర్.. అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు

Advertisement

తాజా వార్తలు

Advertisement