తెలంగాణ మఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం సిరిసిల్లలో పర్యటించారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా సిరిసిల్ల చేరుకున్న కేసీఆర్ తంగళ్లపల్లి మండలం మండేపల్లి వద్ద 27 ఎకరాల విస్తీర్ణంలో జీ ప్లస్ టు పద్ధతిలో రూ. 83.37 కోట్ల వ్యయంతో నిర్మించిన 1,320 డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి గృహప్రవేశం చేయించారు. అనంతరం జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్ (ఐడీటీఆర్)ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం భవనంలో తరగతి గదులను పరిశీలించారు. కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్కుమార్, సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, వేముల ప్రశాంత్రెడ్డి, కరీంనగర్ ఉమ్మడి జిల్లా నేతలతో పాటు పలువురు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
సిరిసిల్లలో సీఎం కేసీఆర్.. అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
Advertisement
తాజా వార్తలు
Advertisement