Friday, May 3, 2024

Cheryala – కొమురవెల్లి మల్లన్న సేవ‌లో ఎమ్మెల్సీ ప‌ల్లా

చేర్యాల: సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం కొమురవెల్లి మల్లికార్జున స్వామిని బీఆర్ఎస్ పార్టీ జనగామ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్సీ డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి కి ఆలయ అర్చకులు సాంప్రదాయం ప్రకారం వేదమంత్రాలతో స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆలయ మండపంలో కొమురవెల్లి మల్లన్నకు పట్నం వేసి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం భారీ బైక్ ర్యాలీతో కొమురవెల్లి నుండి జనగామకు బయలుదేరారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీలు బడ్డిపడగ కృష్ణారెడ్డి, ఉల్లంపల్లి కరుణాకర్, రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్ అంకుగారి శ్రీధర్ రెడ్డి, కొమురవెల్లి జెడ్పిటిసి సిదప్ప, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు, నాలుగు మండలాల ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

పల్లా గో బ్యాక్…. చేర్యాల రెవెన్యూ డివిజన్ నాయకులు…
కొమురవెల్లి మల్లన్నను దర్శించుకున్న అనంతరం చేర్యాల మీదుగా ర్యాలీ గా వెళుతున్న సమయంలో రెవెన్యూ డివిజన్ సాధన సమితి దీక్ష శిబిరం వద్దకు పల్లా వెళ్లే ప్రయత్నం చేయగా అక్కడ రెవెన్యూ డివిజన్ నాయకులు పల్లా గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. పల్లా రాజేశ్వేర్ రెడ్డి వెనుతిరిగి జై చేర్యాల అంటూ నినాదాలు చేస్తూ వెళ్ళారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement