Tuesday, April 30, 2024

Chennur – కాంగ్రెస్ కు ఎదురు దెబ్బ – రాజా రమేష్ పార్టీకి గుడ్ బై

చెన్నూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించిన రాజా రమేష్ పార్టీకి రాజీనామా చేశారు. వలసవాదులకు టికెట్లు ఇచ్చినందుకు నిరసనగా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి చెన్నూరు టికెట్ ను వివేక్ కు అమ్ముకున్నట్లు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి పలుమార్లు మోసం చేసి ఇతర పార్టీలకు వెళ్లిన వివేక్ కు డబ్బుల సంచుల కోసం చెన్నూరు పార్టీ టికెట్ను అమ్ముకోవడం సిగ్గుచేటన్నారు. త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని, చెన్నూరులో కాంగ్రెస్ ఓటమి కోసం పనిచేస్తానన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement