Sunday, May 5, 2024

Crime | శంకర్​పల్లిలో చైన్ స్నాచింగ్.. చేజ్ చేసి ప‌ట్టుకున్న పోలీసులు

శంకర్ పల్లి (ప్రభన్యూస్): శంకర్‌ప‌ల్లి మున్సిపాలిటీ పరిధిలోని చేపల మార్కెట్ వద్ద ఇవ్వాల (ఆదివారం) చైన్ స్నాచింగ్ జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డ్డ వ్య‌క్తిని స్థాన‌కులు ప‌ట్టుకుని పోలీసులకు అప్పగించారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం కోనాపూర్ గ్రామానికి చెందిన బక్క సంగొల్ల సునంద(40), భర్త సత్యనారాయణతో క‌లిసి త‌న‌ కూతురును హాస్టల్ కు పంపే క్రమంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. కొన్ని వస్తువుల కొనుగోలు చేయ‌డానికి శంక‌ర్‌పల్లికి వచ్చారు.

పట్టణ పరిధిలోని చేపల మార్కెట్ దగ్గర నిమ్మకాయలు కొనుగోలు చేస్తుంటే సంగారెడ్డి జిల్లా అందోల్ మండల్ రామ్సాన్ పల్లి గ్రామానికి చెందిన నాయికోటి రవీందర్ (27), సునంద మెడ‌లోని పుస్తెల తాడు చోరీ చేయ‌బోయాడు. ఆ మెడ‌లోని మూడు తులాల పుస్తెల తాడును లాక్కొని వెళ్లే క్రమంలో యువకులు పోలీసులకు సమాచారం ఇవ్వగా స్థానిక పోలీసులు, అక్క‌డి యువకులు క‌లిసి వెంబడించి దొంగ‌ను పట్టుకున్నారు. శంకర్‌ప‌ల్లి పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement