Tuesday, May 7, 2024

పలు దేశాలకు వ్యాక్సిన్ అందించిన ఘనత ప్రధానిదే- కేంద్రమంత్రి పురుషోత్తం రూపాల


కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ నియోజకవర్గంలోని బిచ్కుంద మండలంలో కేంద్ర పశుసంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తం రూపాల పర్యటించారు. బిచ్కుంద మటమ్ లోకి వెళ్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మఠాధిపతి సోమయప్ప మహారాజు కేంద్రమంత్రికి ఘన స్వాగతం పలికారు. అంతకుముంద కేంద్ర మంత్రికి బిజెపి నాయకులు కామారెడ్డి జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షురాలు అరుణతార ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికి సన్మానించారు. పార్లమెంటు ప్రభాస్ యోజన కార్యక్రమంలో భాగంగా కేంద్రమంత్రి జుక్కల్ నియోజకవర్గం రావడం జరిగింది. ఈ ప్రాంతంలో వడగండ్ల వానకు పంట నష్టం జరిగిన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తానని ఆయన అన్నారు. ఇతర దేశాలలో ప్రధానమంత్రి మోడీని చూసి ఆశ్చర్యపోతున్నారని ఆయన అన్నారు. టెక్నాలజీలు, ఇతర దేశాల నుంచి గతంలో అప్పు తెచ్చుకొని వ్యాక్సిన్స్ లాంటి ఆరోగ్యపరంగా గతంలో ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకొని వారని ప్రధానమంత్రి మోడీ వచ్చిన తర్వాత మన భారతదేశానికి ఇతర దేశస్తులు వ్యాక్సిన్స్ ఇతర పదార్థాలను మనం ఇస్తున్నామంటూ ప్రపంచ దేశాల్లోకెల్లా గర్వకారణం అంటూ ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని పార్టీ కార్యకర్తలు జూకల్ అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ శ్రీధర్ కులకర్ణి, ఇతర మండల ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement