Saturday, April 27, 2024

బైక్ ను ఢీకొన్న ఆర్టీసీ బ‌స్సు.. ఇద్ద‌రు మృతి

నంద్యాల జిల్లా (పాణ్యం) : బైక్ ను ఆర్టీసీ బ‌స్సు ఢీకొన‌డంతో ఇద్ద‌రు మృతిచెందిన విషాద ఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లాలో చోటుచేసుకుంది. పాణ్యం సమీపంలో ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొంది. ప్రమాదంలో అక్కడికక్కడే దంపతులు మృతిచెందారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతులు ఏ ప్రాంతంకు చెందిన వారన్న విషయంపై విచారణ చేస్తున్నారు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement