Monday, April 29, 2024

Shame | రెజ్లింగ్​ ఫెడరేషన్​ చీఫ్ బ్రిజ్​భూషణ్​పై లైంగిక వేధింపుల కేసు నమోదు.. సుప్రీం ఆదేశాలు​

మహిళా క్రీడాకారులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న వ్యక్తిపై కేసు నమోదు చేయాలని కోరుతూ ఢిల్లీలోని జంతర్​ మంతర్​ వద్ద క్రీడాకారులు ఆందోళన చేస్తున్నారు. రెజ్లింగ్​ ఫెడరేషన్​ చీఫ్​గా ఉన్న బ్రిజ్​ భూషణ్​ తమను లైంగికంగా వేధించారని ఏడుగురు మహిళా రెజ్లర్లు సుప్రీంకోర్టులో పిటిషన్​ దాఖలు చేయగా.. ఆ పిటిషన్​ని సీజేఐతో కూడిన బెంచ్​ విచారణ చేపడుతోంది. కాగా, ఇవ్వాల (శుక్రవారం) బ్రిజ్​భూషణ్​ సింగ్​పై కేసు నమోదు చేయనున్నట్టు సుప్రీంకోర్టు బెంచ్​ ముందు సోలిసిటర్​ జనరల్​ తుషార్​ మెహతా చెప్పారు.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై ఇవ్వాల (శుక్రవారం) లైంగిక వేధింపుల కేసు నమోదు అయ్యింది. ఏడుగురు మహిళా రెజ్లర్ల ఆరోపణలపై శుక్రవారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని నిర్ణయించినట్లు ఢిల్లీ పోలీసులు సుప్రీంకోర్టుకు తెలియజేశారు. ఈరోజు ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తామని ఢిల్లీ పోలీసుల తరఫు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనానికి తెలిపారు.

కాగా, బెంచ్ ఢిల్లీ పోలీసు కమిషనర్‌ను బెదిరింపు అవగాహనను అంచనా వేయాలని, లైంగిక వేధింపులకు గురైన మైనర్ బాలికలలో ఒకరికి తగిన భద్రత కల్పించాలని ఆదేశించింది. ఈ విషయంపై దేశంలోని అగ్రశ్రేణి రెజ్లర్లు ఆదివారం నుంచి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బైఠాయించి నిరసన చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement