Friday, April 26, 2024

ఖమ్మంలో కేబుల్ బ్రిడ్జ్.. గ్రేట్ అంటూ ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్..

ప్ర‌భ‌న్యూస్ : ఖమ్మంలోని లకారం ట్యాంక్‌బండ్‌పై నిర్మించిన తీగల వంతెన నగర వాసులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ తీగల వంతెన చిత్రాన్ని పోస్టుచేస్తూ రాష్ట్ర ఐటీ, పురపాలక మంత్రి కేటీఆర్‌ సోమవారం ట్వీట్‌ చేశారు. వంతెనను బాగా నిర్మించారని రవాణా మంత్రి, ఖమ్మం ఎమ్మెల్యే అయిన పువ్వాడ అజయ్‌కుమార్‌పై కేటీఆర్‌ ప్రశంసలు కురి పించారు. కాగా, మంత్రి పువ్వాడ మాస్టర్‌ ప్లాన్‌తో ఖమ్మం నగరం మరింత సుందరంగా మారుతోంది.

పువ్వాడ ఖమ్మం నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన నాటినుంచి తన నియోజకవర్గాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పని చేస్తూ.. ఖమ్మం అంటే అభివృద్ధికి గుమ్మంగా నిలుపుతూ ఖమ్మం నియోజకవర్గంలోని ప్రజలను ఎప్పటికప్పుడు అశ్చర్య పరుస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement