Tuesday, April 30, 2024

MBNR: వ్యక్తి దారుణ హత్య… తామే హత్య చేశామని ఒప్పుకున్న భార్య, మామ

చిన్న చింతకుంట, మార్చి 15 ఫ్రభ న్యూస్ : మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలంలోని కురుమూర్తి గ్రామంలో వ్యక్తి దారుణహత్యకు గుర‌య్యారు. డీఎస్పీ వెంకటేశ్వర్లు సమాచారం మేరకు 17సంవత్సరాల క్రితం వేముల గ్రామానికి చెందిన సాయన్న (38)కు కురుమూర్తి గ్రామానికి చెందిన డోలు ఏంకటన్న కుమార్తె గాయిత్రికి వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు. భార్యభర్తల మధ్య గొడవలు రావడంతో గాయిత్రి జనవరిలో పుట్టింటికి వెళ్లింది.

అయితే ఈనె 10వ‌ తేదీ మృతుడు సాయన్న అత్తగారి ఇంటికి రాగా రాత్రి సమయంలో మామ ఏంకటన్న కర్రతో తలపై కొట్టగా మృతిచెందాడని, భార్య గాయిత్రి తండ్రికి సహకరించగా మృతదేహాన్ని ద్విచక్రవాహనంపై తీసుకుని శివారులోని ఊకచెట్టు వాగులో పూడ్చి రక్తపు బట్టలను కురుమూర్తి సమీపంలోని బావి సమీపంలో వేసి.. సాయన్న కనిపించడం లేదని మృతుడి బందువులకు తెల‌ప‌డంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే పోలీసులు భార్య గాయిత్రి మామ ఏంకటన్నను అనుమానంతో విచారించగా.. తామే హత్య చేశామ‌ని తెలిపార‌ని, మృతదేహాన్ని తహశీల్దార్ కృష్ణయ్య సమక్షంలో పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. క్షుద్రపూజలు, మూడ నమ్మకాలు ఏవీ లేవని పోలీసులు తేలిపారు. సిఐ నాగార్జున గౌడ్, ఎస్ఐ ఆర్ శేఖర్ లు విలేకరుల సమావేశంలో వున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement