Sunday, May 5, 2024

రైతు వేదిక‌ల‌పై బిఆర్ఎస్ చర్చ‌కు నిర‌స‌న సెగ – రుణ‌మాఫీ చేయాలంటూ నినాదాలు

సంస్థన్ నారాయణపురం జులై 18(ప్రభ న్యూస్): – సంస్థన్ నారాయణపురం మండల కేంద్రంలో రైతు వేదికలో రైతన్నలకు మూడు గంటల విద్యుత్ చాలన్న కాంగ్రెస్ విధానం పైన ప్రతి గ్రామంలో చర్చ జరగాలని బిఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు రైతు చర్చ వేదికలో పాల్గొన్న ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి కాంగ్రెస్ నాయకులు, రైతులు ప్ల‌ కార్డులతో నిరసన తెలిపారు. రైతులకు రుణమాఫీని, రాచకొండ పోడు భూముల సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేశారు. రైతు వేదికలో పార్టీ మీటింగులు పెట్టడం ఏందని ప్రశ్నించారు.

పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కాంగ్రెస్ నాయకులను రైతులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement