Sunday, April 28, 2024

పర్యావరణ రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత.. సీపీ సుబ్బారాయుడు

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని కరీంనగర్ సీపీ సుబ్బారాయుడు పిలుపునిచ్చారు. మంగళవారం హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ… ప్రతిఒక్కరూ మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలన్నారు. కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ లో పాటు ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement