హైదరాబాద్ – :ఫస్ట్ లిస్ట్ విడుదల వేళ బీజేపీ హైకమాండ్ సంచలన నిర్ణయం తీసుకుంది. గోషామహాల్ ఎమ్మెల్యేపై విధించిన సస్పెన్షన్ను ఎత్తివేసింది. ఈ మేరకు ఆదివారం అధికారిక ప్రకటన విడుదల
దీంతో అందరూ ఊహించినట్లుగానే బీజేపీ ఫస్ట్ లిస్ట్లోనే రాజాసింగ్ పేరు ఉండనున్నట్లు తెలుస్తోంది. కాగా, గత ఆగస్టు 22వ తేదీన సోషల్ మీడియాలో రాజాసింగ్ ఓ వీడియో అప్లోడ్ చేశారు. ఈ వీడియోలో మహ్మద్ ప్రవక్తను కించపర్చేలా ఉందని ఎంఐఎంతో పాటు ముస్లింలు
వ్యక్తం చేశారు.ఈ క్రమంలోనే రాజాసింగ్పై బీజేపీ అధిష్టానం సస్పెన్షన్ వేటు వేసింది. సెప్టెంబర్ 2లోగా వివరణ ఇవ్వాలని రాజాసింగ్ను పార్టీ ఆదేశించింది. బీజేపీ శాసనసభా పక్ష నేత స్థానం నుంచి కూడా పార్టీ ఆయనను తొలగించిన విషయం తెలిసిందే. రాజాసింగ్పై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. దీంతో ఆగస్టు 23న ఆయనను అరెస్ట్ చేశారు. అయితే అదే రోజు ఆయనకు నాంపల్లి కోర్టు బెయిల్ ఇచ్చింది. ఆగస్టు 25న రాజాసింగ్పై పీడీయాక్ట్ నమోదు చేసి మళ్లీ అరెస్ట్ చేశారు. ప్రస్తుతం రాజాసింగ్ చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఎన్నికల వేళ ఎట్టకేలకు ఆయనపై సస్పెన్షన్ ఎత్తివేయడంతో బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు