Thursday, May 2, 2024

Breaking: నిలోఫ‌ర్ ఆస్ప‌త్రికి మంత్రి కేటీఆర్‌.. చిన్నారి కుటుంబానికి భ‌రోసా

Telangana: రాజన్న సిరిసిల్ల జిల్లాలో అత్యాచారానికి గురైన ఆరేళ్ల చిన్నారి నిలోఫ‌ర్ హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతోంది. బుధ‌వారం టీఆ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ నిలోఫర్ హాస్పిట‌ల్ కు వ‌చ్చి బాలిక‌ను, బాధిత కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితిని కుటుంబ సభ్యులను, డాక్ట‌ర్ల‌ను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భ‌రోసా ఇచ్చారు.

సమాజంలో ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమని, నిందితుడు ఎవరైనా కఠిన శిక్షపడాల్సిందేనన్నారు. కుటుంబాన్ని అన్నివిధాలుగా ఆదుకుంటామని మంత్రి కేటీార్ హామీ ఇచ్చారు. పాపకి అవసరమైన మెరుగైన వైద్యం అందించాలని ఆస్పత్రి వైద్యులకు సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement