Thursday, April 25, 2024

ఢిల్లీలో రూ.18కోట్ల విలువ చేసే హెరాయిన్ సీజ్..

ఢిల్లీ శివారులో భారీగా డ్ర‌గ్స్ ని ప‌ట్టుకున్నారు. ఈ మేర‌కు రూ.18కోట్ల విలువ చేసే ఆరు కిలోల హెరాయిన్ ని సీజ్ చేశారు. ఢిల్లీ నార్కోటిక్స్ బృందాలు డ్ర‌గ్స్ స‌మాచారాన్ని అందుకుని దాడులు చేశారు. ఈ కేసులో ఇద్ద‌రు వ్య‌క్తుల‌ను అరెస్ట్ చేశారు. ఈ మ‌ధ్య కాలంలో తెలంగాణ లో డ్ర‌గ్స్ కేసు క‌ల‌క‌లం రేగిన సంగ‌తి తెలిసిందే. కాగా టాలీవుడ్ తో పాటు ప‌లు సినీ ప‌రిశ్ర‌మ‌ల‌లో డ్ర‌గ్స్ ని విరివిగా వాడుతున్నార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఏపీలో కూడా భారీగా డ్ర‌గ్స్ దందా కొన‌సాగుతుంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ త‌న‌యుడు ఆర్య‌న్ ఖాన్ కూడా రీసెంట్ గా డ్ర‌గ్స్ కేసులో ప‌ట్టుబ‌డి బెయిల్ పై విడుదల‌యిన సంగ‌తి విదిత‌మే.

Advertisement

తాజా వార్తలు

Advertisement