సీఎం కేసీఆర్ సభ కోసం స్థలాన్ని పరిశీలించేందుకు వచ్చారు టీఆర్ ఎస్ నేతలు. దాంతో వారిని రైతులు అడ్డుకున్నారు. ఈ మేరకు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సంఘటన హనుమకొండ జిల్లా దేవన్న పేటలో చోటు చేసుకుంది. రైతులతో పాటు పలువురు మహిళలు కూడా అడ్డుకోవడంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. పోలీసులు..రైతుల మధ్య తోపులాట జరిగింది. వారి మధ్య మాటా మాటా పెరగడంతో మహిళలు కూడా రంగంలోకి దిగారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు యత్నిస్తున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement