Friday, May 3, 2024

Breaking : లారీ ఢీకొని – యువకుడి మృతి

మండల కేంద్రంలోని అఖిల హాస్పిటల్ ఎదురుగా చెన్నుపాటి ట్రాన్స్ పోర్ట్ కు చెందిన లారీ ఢీకొని ఓ యువకుడు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. మధిర పట్టణానికి చెందిన కొట్టు మూరి ప్రిన్స్ చర్ల మేజర్ గ్రామ పంచాయతీలో అటెండర్ గా విధులు నిర్వహిస్తున్నారు. అతని కుమారుడైన కొట్టుమూరి రాఘవ (23 ) కాలిబాటన రోడ్డు దాటుతుండగా భద్రాచలం వైపు నుండి చర్ల వైపు వస్తున్న చెన్నుపాటి ట్రాన్స్ పోర్ట్ కు చెందిన ఏపీ16 టి డబ్ల్యూ 0348 నెంబర్ గల లారీ ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు అవిహహితుడు. లారీ డ్రైవర్ స్థానిక పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ అశోక్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement