Thursday, April 18, 2024

Breaking : హైద‌రాబాద్..వ‌రంగ‌ల్ లో ప‌ర్య‌టించ‌నున్న జేపీ న‌డ్డా-నితిన్..మిథాలీరాజ్ తో భేటీ

నేడు హైద‌రాబాద్ లో బిజెపి జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా టూర్ బిజీగా మార‌నుంది.ఈ మేర‌కు హీరో నితిన్..క్రికెట‌ర్ మిథాలీరాజ్ తో స‌మావేశం కానున్నారు. కాగా ప‌లువురు ర‌చ‌యిత‌ల‌ను జేపీ న‌డ్డా క‌లిసే అవ‌కాశం ఉంది. మ‌ధ్యాహ్నం 12:40గం.కు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు న‌డ్డా రానున్నారు. శంషాబాద్ నోవాటెల్ హోట‌ల్ లో గంట‌పాటు ఉండ‌నున్నారు న‌డ్డా. మ‌.2:40గం.కు హెలికాఫ్ట‌ర్ లో వ‌రంగ‌ల్ కు జేపీ న‌డ్డా వెళ్ల‌నున్నారు.మూడు గంట‌ల‌కు వ‌రంగ‌ల్ భ‌ద్ర‌కాళీ అమ్మ‌వారిని ద‌ర్శించుకోనున్నారు.4:10నుంచి బిజెపి స‌భ‌లో పాల్గొన‌నున్నారు. సాయంత్రం 6గంల‌కు వ‌రంగ‌ల్ నుంచి హైద‌రాబాద్ కు న‌డ్డా బ‌య‌లుదేర‌నున్నారు. నేడు వ‌రంగ‌ల్ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్స్ లో బిజేపి స‌భ జ‌ర‌గ‌నుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement