Sunday, May 5, 2024

హైదరాబాద్ లో విరబూసిన బ్రహ్మకమలాలు..

హిమాలయాల్లో ఏడాదికి ఒక్కసారే విరిసే బ్రహ్మ కమలాలు మన భాగ్యనగరిలో విరబూశాయి. యాప్రాల్ పరిధిలోని కల్యాణ్ పురి కాలనీలో నివాసం ఉంటున్న వ్యాపారవేత్త కవిత దంపతుల ఇంట్లో ఒకేసారి ఐదు బ్రహ్మ కమలాలు పూశాయి. గతంలో తీసుకుని వచ్చి నాటిన మొక్క ఎదిగి పూలు పూయడంతో వారు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక చుట్టుపక్కల ఉన్న వారు ఎంతో మంది ఆ పూలను ఫోటోలు తీసేందుకు, వాటితో సెల్ఫీలు దిగేందుకు వస్తుండటంతో, కవిత ఇల్లు ఇప్పుడు సందడిగా కనిపిస్తోంది. కొన్ని ఔషదాల్లో ఉపయోగించే ఈ అరుదైన బ్రహ్మ కమలాలు సాధారణ వాతావరణంలో వికసించవు. ఆగస్టు నుంచి సెప్టెంబరు నెలల్లో.. సముద్రమట్టానికి 3500 నుంచి 3800 మీటర్ల ఎత్తులో మాత్రమే వికసిస్తాయి. కాని మన హైదరాబాద్ లో విరబూసేసరికి వీటిని చూసేందుకు ప్రజలు ఆసక్తిని చూపిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement