Wednesday, May 8, 2024

Medak | కుక్కల దాడిలో బాలుడికి గాయాలు.. నర్సాపూర్​లో ఘటన

ఊర కుక్కల దాడిలో ఒక బాలుడికి గాయాల‌య్యాయి. ఈ ఘటన మెదక్​ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని శివాలయం వీధిలో ఇవ్వాల (శనివారం) జరిగింది. నర్సాపూర్ పట్టణానికి చెందిన బాలుడు సురేష్ పై కుక్కలు దాడి చేశాయి. దీంతో ఆ బాలుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఊర కుక్కలు బాలుడి వెంటపడుతూ దాడి చేస్తుండగా స్థానికులు గమనించి వాటిని తరిమి కొట్టారు.

కుక్కల దాడిలో గాయపడ్డ బాలుడు సురేష్ ను ప్రథమ చికిత్స కోసం నర్సాపూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఊర కుక్కల బెడద తీవ్రంగా ఉన్నందున అధికారులు స్పందించి వాటి నియంత్రణకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement