Wednesday, May 15, 2024

మా కాల‌నీకి బస్సు న‌డ‌పండి.. ఆర్టీసీ డిపో మేన‌జ‌ర్‌కు విజ్ఞ‌ప్తి

మేడిపల్లి, (ప్రభన్యూస్): హైద‌రాబాద్‌, పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్‌లోని 25వ డివిజన్‌కు బ‌స్సు న‌డ‌పాల‌ని కాల‌నీ వాసులు ఆర్టీసీ డిపో మేనేజ‌ర్‌కు విజ్ఞ‌ప్తి చేశారు. సాయినగర్ కాలనీ నుంచి చాలామంది ప‌నుల నిమిత్తం బ‌య‌ట‌కు వెళ్తుంటార‌ని, వారికి ఎట్లాంటి ర‌వాణా స‌దుపాయం లేక‌పోవ‌డంతో ఇబ్బంది ప‌డుతున్న‌ట్టు తెలిపారు. ఈ విష‌యాన్ని స్థానిక కార్పొరేటర్ దొంతిరి హరిశంకర్ రెడ్డితో పాటు ఆర్టీసీ చెంగిచర్ల డిపో మేనేజరుకు తెలిపారు.

- Advertisement -

సాయినగర్ కాలనీలో నిత్యం ప్రయాణించే ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, ఇరతత్రా పనులు చేసుకునే వారు చాలామంది ఉన్నారని వారందరి సౌకర్యార్థం ఆర్టీసీ బస్సులు నడపాలని కోరారు. ఈ మేరకు కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు రవీందర్ చారి, ఇబ్రహీం ఖాన్, ఇతర ప్రతినిధులు డిపో మేనేజర్‌ ను కలిశారు. దీనికి డీఎం సానుకూలంగా స్పందించి, రూట్ సర్వే అనంతరం బస్సు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement