Thursday, May 16, 2024

Flash.. Flash: లారీని ఢీ కొట్టిన బొలెరో.. నలుగురికి తీవ్రగాయాలు

బొలెరో వాహనం లారిని వెనుకనుండి ఢీకొట్టిన ప్రమాదంలో న‌లుగురికి తీవ్రంగా గాయాల‌య్యాయి. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఇవ్వాల అర్ధ‌రాత్రి జ‌రిగింది. శాంతినగర్ శివారులో పెద్దపెల్లి బస్టాండ్ వైపు వస్తున్న లారీని బొలెరో వాహనం వెనుక నుండి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బొలెరో వాహనంలో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

క్షతగాత్రులను పెద్దపల్లి ప్రభుత్వ ఆస్ప‌త్రికి తరలించి చికిత్స జరుపుతున్నారు. గాయపడిన వారిలో పెద్ద పల్లి మున్సిపల్ రెండో వార్డు కౌన్సిలర్ హనుమంతు, లక్ష్మణ్ తో పాటు మరో ఇద్దరు పిల్లలున్నారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. సమాచారం అందుకున్న పెద్దపల్లి పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement