Saturday, April 27, 2024

KishanReddy: బీజేపీ కీల‌క స‌మావేశం.. శాసనసభాపక్ష నేతను ఎన్నుకునే ఛాన్స్‌

ఇవాళ‌ బీజేపీ కీలక సమావేశం నిర్వ‌హించ‌నుంది. ఇందులో భాగంగా తెలంగాణ బీజేపీ చీఫ్‌ కిషన్‌రెడ్డి అధ్యక్షతన బీజేపీ కోర్‌ కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా బీజేపీ శాసనసభాపక్ష నేతను ఎన్నుకునే అవకాశం ఉంది.

ఈ భేటీలో పార్టీ అంతర్గత అంశాలు, నేతల మధ్య సమన్వయంపై చర్చ జరగనుంది. ఈ క్రమంలోనే లోక్‌సభ ఎన్నికల్లో సీటు ఆశిస్తున్న వారిపై రాష్ట్ర ఎన్నికల కమిటీలో చర్చ జరగనుంది. ఏకాభిప్రాయం ఉన్న స్థానాల్లో ముగ్గురితో కూడిన జాబితాను సిద్ధం చేసి నేతలు కేంద్ర కమిటీకి పంపించనున్నారు. ఇక, పార్లమెంట్‌లో పొలిటికల్‌ ఇంఛార్జ్‌లు, కన్వీనర్లతో సమావేశం సందర్భంగా పార్లమెంట్‌ ఎన్నికల రోడ్‌ మ్యాప్‌ను ఖరారు చేయనున్నారు. మరోవైపు, బీజేపీ శాసనసభాపక్ష నేతను కూడా నేడు ఎన్నుకునే ఛాన్స్ ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement