Sunday, May 19, 2024

ఎంపీ ప్రకాష్ జగదేకర్ ని కలిసిన.. బిజెపి నేత ధన్ పాల్

నిజామాబాద్ సిటీ, (ప్రభ న్యూస్) : మహాజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ ప్రకాష్ జవదేకర్ నిజామాబాద్ కు విచ్చేసారు. నిజామాబాద్ నగరంలోని నిఖిల్ సాయి హోటల్ లో కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ ప్రకాష్ జవదేకర్ ని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్ పాల్ సూర్యనా రాయణ మర్యాదపూ ర్వకంగా కలిసారు. ఈ సంద ర్భంగా నరేంద్ర మోడీ చేస్తున్న అభి వృద్ధి కార్యక్రమాల పైన వారి పనితీరుపైన కొద్దిసేపు ముచ్చటించారు.. ఈ కార్యక్ర మంలో కార్పొరేటర్లకు కొన్ని సూచనలు ఇచ్చారు. అర్బన్ నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలపై వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్య క్షులు బసవ లక్ష్మీ నరసయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి పోత నకర్ లక్ష్మీనారాయణ, అసెంబ్లీ కన్వీనర్ పంచారెడ్డి లింగం ఉపాధ్యక్షులు నాగొల్ల లక్ష్మీనా రాయణ ,మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గోపిడి స్రవంతి రెడ్డి, కార్పొరేటర్లు పంచారెడ్డి ప్రవళిక శ్రీధర్ ,మాస్టర్ శంకర్, ఎర్రం సుధీర్, బూర్గుల వినోద్ , ఇల్లెందుల ప్రభాకర్, మండల అధ్యక్షులు రోషన్ లాల్ బోరా, గడ్డం రాజు ,పుట్టా వీరేందర్, శివునూరి భాస్కర్,హరీష్ రెడ్డి, భట్టికారి ఆనంద్ ,మఠం పవన్ , భాస్కర్ రెడ్డి ,ఆశిష్, కిరణ్, కార్తీక్, బిజెపి నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement