Sunday, May 5, 2024

16 మంది ఇన్స్ పెక్ట‌ర్ల బదిలీ

పెద్దపల్లి, జూన్‌ 14 (ప్రభ న్యూస్‌): మల్టి జోన్‌ వన్‌లో పని చేస్తున్న 16 మంది ఇన్స్‌పెక్టర్లను బదిలీ చేస్తున్నట్లు ఐజీ చంద్రశేఖరరెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సీఐడీలో పని చేస్తున్న సతీష్ కుమార్‌ను నిజామాబాద్‌ నార్త్‌ రూరల్‌ సర్కిల్‌కు, నిజామాబాద్‌ నార్త్‌ రూరల్‌ సర్కిల్‌లో పని చేస్తున్న నరహరిని నిజామాబాద్‌ సీసీఆర్‌బీకి, కరీంనగర్‌ వన్‌టౌన్‌లో పని చెస్తున్న నటేశ్‌ను జగిత్యాలకు, పవన్‌కుమార్‌ను ఆసిఫాబాద్‌ సీసీఎస్‌కు, గూడూరులో పని చేస్తున్న షేక్‌ యాసిన్‌ను మహబూబాబాద్‌ సీసీఆర్‌బీకి, నిజామాబాద్‌ పీసీఆర్‌లో పని చేస్తున్న రాజమౌళిని రాజన్న సిరిసిల్ల జిల్లా సీసీఎస్‌కు, ఆదిలాబాద్‌ టూటౌన్‌లో పని చేస్తున్న పురుషోత్తంను నిర్మల్‌కు, నిర్మల్‌లో పని చేస్తున్న మల్లేశ్‌ను నిజామాబాద్‌ పీసీఆర్‌కు, పాల్వంచలో పని చేస్తున్న కొత్తగూడెం సీసీఆర్‌బీకి, హసన్‌పర్తిలో పని చేస్తున్న రవి కుమార్‌ను కరీంనగర్‌ వన్‌టౌన్‌కు, సీసీఎస్‌ రామగుండంలో ఉన్న శ్రీనివాసరావును తాండూరుకు, వెయిటింగ్‌లో ఉన్న మధును సిద్దిపేట సీసీఎస్‌కు, శ్రీరాంపూర్‌ సర్కిల్‌లో ఉన్న రాజును రామగుండం లీగల్‌ సెల్‌కు, డీఎస్‌బీ ఆసిఫాబాద్‌లో ఉన్న సత్యనారాయణను రామగుండం సీసీఎస్‌కు, జైనూర్‌లో పని చేస్తున్న రామకృష్ణను ఉట్నూర్‌కు, ఆదిలాబాద్‌ మహిళా పోలీస్‌ స్టేషన్‌లో పని చేస్తున్న మల్లేశ్‌ను జైనూర్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement