Sunday, May 5, 2024

Bandi : బీసీల ప‌ట్ల నిబ‌ద్ద‌త క‌లిగిన పార్టీ బీజేపీ ఒక్క‌టే

పాపం అంతో ఇంతో కష్టపడుతున్న రేవంత్ రెడ్డికి చివరకు కాంగ్రెస్ మొండిచెయ్యి చూపిస్తుందని బిజేపి నేత బండి సంజయ్ ఎద్దెవా చేశారు. బీసీలకు ముఖ్యమంత్రి పదవి ఇస్తామని తాము అంటే అందరూ తమను అవహేళన చేస్తున్నారనీ, కానీ బీసీల పట్ల నిబద్ధత కలిగిన పార్టీ బీజేపి ఒక్కటేనని సంజయ్ చెప్పారు. బీసీ కమిషన్ ఏర్పాటు చేసిన ఘనత మోదీదేనన్నారు.

కాంగ్రెస్ లో రేవంత్ బలిపశువు కావడం తప్పదన్నారు. ఇటీవల కొందరు ముస్లిం మతపెద్దలు రాహుల్ గాంధీని ఢిల్లీలో కలిసి, మద్దతు ప్రకటించినట్లు తనకు తెలిసిందని సంజయ్ చెప్పారు. తెలంగాణలో రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయబోమని హామీ ఇస్తేనే తాము మద్దతు ఇస్తామని అన్నారని, అందుకు రాహుల్ గాంధీ కూడా సరేనన్నట్లు తనకు తెలిసిందని సంజయ్ చెప్పారు.తాను కరీంనగర్ నుంచి సోమవారం నామినేషన్ వేయనున్నట్లు సంజయ్ చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement