Monday, May 20, 2024

14న బిజెపి హిందూ ఏక్తా యాత్ర – బండి సంజ‌య్

క‌రీంన‌గ‌ర్ – హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 14న కరీంనగర్‌లో హిందూ ఏక్తా యాత్రను నిర్వహించనున్నట్లు భారతీయ జనతా పార్టీ తెలిపింది. కరీంనగర్ లో హిందూ ఏక్తా యాత్ర నిర్వహించనుంది. ఇందులో లక్షలాది మంది పాల్గొంటారని రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ తెలిపారు. బీజేపీ శ్రేణులతో పాటు ఆ పార్టీ కీలక నేతలు పాల్గొంటారని చెబుతున్నారు. ఈ హిందూ ఏక్తా యాత్రలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ, తెలంగాణ బీజేపీ ఇంచార్జ్ తరుణ్ చుగ్, ఇతర నేతలు పాల్గొంటారని సమాచారం. హిందూ ధర్మ పరిరక్షణ కోసం కృషి చేస్తున్న వారందరూ హిందూ ఏక్తా యాత్రలో పాల్గొనాలని బండి సంజయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఈ యాత్ర హిందువుల ఐక్యతను చాటి చెబుతుందని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement