Sunday, April 28, 2024

BJP – మ‌ల్కాజిగిరి లోక్ స‌భ స్థానం నుంచి పోటీ చేయాల‌ని ఉంది – ఈట‌ల

ఇల్లందుకుంట – వచ్చే లోక్ స‌భ ఎన్నిక‌ల‌లో మల్కాజిగిరి స్థానం నుంచి పోటీ చేసే అవ‌కాశం ఇవ్వ‌మ‌ని బిజెపి అధిష్టానాన్ని కోరిన‌ట్లు , తెలంగాణ బిజెపి చేరికల కమిటీ ఛైర్మన్, మాజీ మంత్రి ఈటల రాజేందర్ వెల్ల‌డించారు. కరీంనగర్‌లో సిట్టింగ్ ఎంపీ ఉండ‌ట‌తో ఆ స్థానాన్నిఆశించ‌డం లేద‌న్నారు. కరీంనగర్ జిల్లా ఇళ్ళందకుంట మండలం లక్ష్మాజిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ. అధిష్టానం ఎలా చెబితే అలా న‌డుచుకుంటాన‌ని వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో కొన్ని పత్రికలు చిల్లర మల్లరగా రాస్తున్నాయని.. తాను కాంగ్రెస్‌లోకి వెళ్తున్నానని దుష్ప్రచారం చేస్తున్నాయని తీవ్రంగా మండిపడ్డారు. ఆ ప్రచారాలను ఎవరూ నమ్మవద్దన్నారు.

ఆమెరికా లాంటి అగ్రరాజ్యం భారతదేశానికి రెడ్ కార్పెట్ వేస్తున్న‌దని, మోడీ వల్లే మన దేశం ఇంతగా అభివృద్ధి చెందిందన్నారు. బీజేపీ పార్టీ కొత్త‌గా ఏర్ప‌డిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చి వేస్తుంది అంటున్నారని.. ప్రజలు అధికారం బెట్టారని, మళ్ళీ కూల్చే అధికారం వారికే ఉంటుందన్నారు. 2018లో కేసీఆర్ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలను తీసుకున్నార‌ని, అందుకే ప్రజలు బీఆర్‌ఎస్ పార్టీకి తగిన బుద్ది చెప్పారన్నారు. రెండవ విడుత దళిత బంధు వెంటనే ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement