Wednesday, May 1, 2024

AP: విడ‌క‌న‌క‌ల్లు చెక్ పోస్టు వ‌ద్ద‌ రూ.కోటి 75 లక్షల సీజ్

అనంతపురం జిల్లా పోలీసులు భారీగా డబ్బును పట్టుకున్నారు. విడకనకల్లు చెక్ పోస్టు వద్ద కారులో తరలిస్తుండగా గుర్తించారు. మొత్తం రూ.కోటి 75 లక్షలను బెంగళూరుకు తరలిస్తున్నారు. బళ్లారి వైపు నుంచి ఉరవకొండవైపు వెళ్తున్న వెర్నా కారును పోలీసులు చెకింగ్ చేశారు. దీంతో నగదు విషయం బయటపడింది. పట్టుకున్న డబ్బును పోలీసులు సీజ్ చేశారు.

కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సిదిగుప్ప నుంచి బెంగళూరుకు తరలిస్తున్నట్లు కారు డ్రైవర్ చెప్పినట్లు పోలీసులు తెలిపారు. నగదుపై ఆరా తీస్తే డ్రైవర్ పొంతన లేని సమాధానం చెప్పినట్లు పేర్కొన్నారు. మొత్తం నగదును సీజ్ చేశామని వెల్లడించారు. ఎలాంటి పత్రాలు సైతం చూపలేదని పోలీసులు స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement