Sunday, April 28, 2024

IDCR: జెర్సీ, రేస్ రూట్, రేస్ మెడల్, ఛారిటీ బిబ్‌లను ఆవిష్కరించిన ఐడీసీఆర్

హైద‌రాబాద్ : ఇనార్బిట్ మాల్ సైబరాబాద్, మైండ్‌స్పేస్ బిజినెస్ పార్క్స్, ది వెస్టిన్, మాదాపూర్ భాగస్వామ్యంతో త్వరలో నిర్వహించబోనున్న భారీ కార్యక్రమం, ఇనార్బిట్ దుర్గం చెరువు రన్ (ఐడీసీఆర్) 2024 కోసం అధికారిక జెర్సీ, రేస్ రూట్, రేస్ మెడల్, ఛారిటీ బిబ్‌లను ఆవిష్కరించింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ జి వినీత్, ఐపిఎస్, డిసిపి, మాదాపూర్, టి.శ్రీనివాసరావు, ఐపిఎస్, డీసీపీ ట్రాఫిక్ తో పాటు సృజన, ఐపీఎస్, డీసీపీ ఉమెన్ సేఫ్టీ, శ్రవణ్ గొనె , సీఓఓ, కే రహేజా కార్ప్, శరత్ బెలవాడి, సెంటర్ హెడ్, ఇనార్బిట్ మాల్ హైదరాబాద్, అండ్ మయూర్, వ్యవస్థాపకుడు అండ్ సీఈఓ, నిర్మాణ్.ఆర్గ్ సహా ప్రముఖులు హాజరయ్యారు.

ఈనెల 28న ఈ రన్ జరుగనుంది. ఈ 4వ ఎడిషన్‌ రన్ లో దేశవ్యాప్తంగా ఉన్న రన్నర్లు 21కిమీ, 10 కిమీ, 5 కిమీల మూడు విభాగాలలో పోటీపడతారు. నిర్మాణ్.ఆర్గ్ ఈ సంవత్సరం సీఎస్ఆర్ భాగస్వామిగా కొనసాగుతుంది, బిజినెస్ పార్క్ పార్టనర్ గా మైండ్‌స్పేస్, హాస్పిటాలిటీ పార్టనర్‌గా ది వెస్టిన్ వ్యవహరిస్తుంది.

ఈ సందర్భంగా ఇనార్బిట్ మాల్ హైదరాబాద్ సెంటర్ హెడ్ శరత్ బెలవాడి మాట్లాడుతూ… ఎల్జీ బీటీక్యూ ప్లస్ కమ్యూనిటీకి చెందిన సభ్యులతో పాటు ఈ రన్ లో దాదాపు 100మంది దివ్యాంగులు కూడా పాల్గొంటారన్నారు. మొత్తం బహుమతి రూ.6లక్షలు కాగా, వివిధ విభాగాల్లోని 48మంది రన్నర్‌లకు ఇది అందించబడుతుందన్నారు. ఈ పరుగులో పాల్గొనేందుకు నమోదు చేసుకోవడానికి చివరి తేదీ ఈనెల 21 అని, దాదాపు 6500 మంది ఈ రన్ లో పాల్గొనే అవకాశం ఉందన్నారు. నిర్మాణ్.ఓ ఆర్ జి వ్యవస్థాపకుడు అండ్ సీఈఓ మయూర్ మాట్లాడుతూ… ఐడీసీఆర్ చాలా బలమైన కారణం రన్ ఫర్ ఇంక్లూజన్ తో అనుబంధించబడిందన్నారు. దివ్యాంగులు (పిడబ్ల్యుడిలు), బాలికలు, మహిళలు, ఎల్‌జిబిటిక్యూ ప్లస్ వ్యక్తులకు విద్య, నైపుణ్యం, ఉపాధి, వ్యవస్థాపక అవకాశాలను పొందేందుకు సహాయం చేయడానికి నిధులను సేకరించడం ఈ రన్ లక్ష్యమన్నారు. ఛారిటీ అండ్ కార్పొరేట్ భాగస్వామ్యం ద్వారా ఇప్పటివరకు రూ.99 లక్షలు సేకరించబడ్డాయన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement