Saturday, May 18, 2024

Bjp – 72 మందితో బిజెపి జాబితా – డీకే, రఘు నందన్, సైదిరెడ్డి కి సీట్ల ఖరారు

ఢిల్లీ : లోక్ సభ ఎన్నికలకు 72 మందితో రెండో జాబితాను బీజేపీ విడుదల చేసింది. తెలంగాణ నుంచి ఆరుగురికి ఇందులో చోటు దక్కింది.

మెదక్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా రఘునందన్‌ రావుకు అవకాశం ఇచ్చింది. ఆదిలాబాద్‌ నుంచి మాజీ ఎంపీ గోడం నగేష్‌ పోటీ చేయనున్నారు. మహబూబ్‌నగర్‌ నుంచి డీకే అరుణ, మహబూబాబాద్‌ నుంచి సీతారాం నాయక్‌ బరిలోకి దిగుతుండగా.. పెద్దపల్లి నుంచి గోమాస శ్రీనివాస్‌, నలగొండ నుంచి సైదిరెడ్డి పోటీ చేయనున్నారు.

ఇక తెలంగాణ నుంచి తొలి జాబితాలో తొమ్మిది రెండో జాబితాలో ఆరు స్థానాలకు అభ్యర్ధులను వెల్లడించింది బీజేపీ. ఇప్పటి వరకు 15 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించించగా.. వరంగల్‌, ఖమ్మం స్థానాలను పెండింగ్‌లో ఉంచింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement