Friday, May 24, 2024

TS: రేపు బీజేఎల్పీ కీల‌క భేటీ

రేపు హైదరాబాద్ లో బీజేఎల్పీ బ్రేక్ ఫాస్ట్ సమావేశం జరగనుంది. ఈ మేరకు రేపు ఉదయం 7గంటలకు బీజేపీ ఎమ్మెల్యేలు భేటీ కానున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన పార్టీ కార్యాలయంలో ఈ సమావేశం ఏర్పాటు కానుంది. ఇందులో ప్రధానంగా రేపు అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు.

ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ప్రొటెం స్పీకర్ గా ఉంటే ఎమ్మెల్యేగా తాను ప్రమాణస్వీకారం చేయనని రాజాసింగ్ చెబుతున్నారని సమాచారం. ఈ క్రమంలోనే మిగతా ఏడుగురు ఎమ్మెల్యేల అభిప్రాయాలను సైతం తీసుకోనున్న కిషన్ రెడ్డి విధాన పరమైన నిర్ణయం తీసుకోనున్నారు. రేపు బీజేఎల్పీ సమావేశం అనంతరం నిర్ణయం ప్రకటిస్తామని బీజేపీ వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement