Monday, April 29, 2024

KNR: భక్తజన సంద్రం.. రాజన్న ఆలయం..

వేములవాడ, జనవరి 29 (ప్రభన్యూస్‌): సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. స్వామి వారికి ప్రీతిపాత్రమైన సోమవారం కావడంతో తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు- పక్క రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు రాజన్న క్షేత్రానికి తరలివచ్చారు. తెల్లవారు జామున ధర్మగుండంలో పవిత్ర స్నానాలు ఆచరించిన భక్తులు స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లలో బారులు తీరారు.


గర్బగుడిలో కొలువుదీరిన శ్రీ స్వామివారిని దర్శించుకున్నభక్తులు స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. సుమారు 70 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, రూ.50లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర దృష్ట్యా భక్తుల రద్దీ పెరగనుందని, అందుకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement